- Advertisement -
ఆదిలాబాద్: జిల్లాలోని నార్నార్ మండలం కంపూర్ లో విషాద సంఘటన చోటుచేసుకుంది. పురుగులమందు తాగి యువతీయువకుడు బలవన్మరణానికి పాల్పడ్డారు. స్థానికులు సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. మృతులను గణేశ్(కన్నాపూర్), సీతాబాయి(కంపూర్)గా పోలీసులు గుర్తించారు. లాక్ డౌన్ ముందు గణేశ్, సీతాబాయికి వివాహ నిశ్చితార్థం జరిగిందని కుటుంభీకులు తెలిపారు. కానీ లాక్ డౌన్ కొనసాగున్న నేపథ్యంలో పెద్దలు వివాహన్ని వాయిదా వేశారు. దీంతో మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనతో మృతుల నివాసాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.
Love Couple Commits Suicide in Adilabad District
- Advertisement -