- Advertisement -
ఆర్మూర్: నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం పెర్కిట్ లో శనివారం విషాదం చోటుచేసుకుంది. ఓ ప్రేమజంట ఆత్మహత్య చేసుకుంది. పెర్కిట్ శివారులో చెట్టుకు ఉరేసుకుని యువతీయువకుడు బలవన్మరణానికి పాల్పడ్డారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. ఇంట్లో పెద్దలు పెళ్లికి అంగీకరించకపోవడంతోనే ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. మృతులను వేల్పూర్ మండలం కుకనూర్ కు చెందిన రోహిత్, అవంతిగా గుర్తించినట్టు పోలీసులు వెల్లడించారు. పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సిఉంది.
Love couple commits suicide in Nizamabad
- Advertisement -