Saturday, April 20, 2024

ఎపిలో ప్రేమజంట ఆత్మహత్య..

- Advertisement -
- Advertisement -

Love Couple Suicide in Krishna District

అమరావతి: ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. జిల్లాలోని కంచికర్ల మండలం, మోగులూరులో ఓ ప్రేమజంట ఆత్మహత్యకు పాల్పడింది. గత కొన్నేళ్లుగా అరవింద్(25), నాగమణి(21)లు ప్రేమించుకుంటున్నారు. అయితే, తమ వివాహానికి పెద్దలు ఒప్పుకోలేదని గడ్డిమందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. గుంటూరు ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతూ ఇద్దరు చనిపోయారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయనున్నట్లు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Love Couple Suicide in Krishna District

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News