Friday, April 26, 2024

ప్రేమ పెళ్లి… యువతిపై పెట్రోల్ పోసి….

- Advertisement -
- Advertisement -

Lover attack on girl friend in Vijayanagaram

అమరావతి: ప్రేమించి పెళ్లి చేసుకోబోతున్న యువతిపై ఓ ప్రేమోన్మాది పెట్రోల్ పోసి నిప్పంటించిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలం చౌడువాడలో జరిగింది. అడ్డుకోబోయిన ఆమె అక్క, అక్క కుమారుడు ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. ఒకే గ్రామానికి చెందిన వారు కావడంతో రాంబాబు, సదరు యువతి గత కొన్ని రోజుల నుంచి ప్రేమించుకుంటున్నారు. వీళ్ల ప్రేమ వ్యవహారం కుటుంబ సభ్యులకు తెలియడంతో పెద్దల సమక్షంలో పెళ్లి కుదుర్చారు. యువతి మరో యువకుడితో మాట్లాడుతుండడంతో రాంబాబు పెళ్లి రద్దు చేసుకున్నాడు. ఇరు కుటుంబాల మధ్య గొడవ జరగడంతో పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు. పోలీసులు సదరు యువతిని పెళ్లి చేసుకుంటానని యువకుడు చెప్పడంతో ఘర్షణ సద్దుమణిగింది. గురువారం అర్ధ రాత్రి యువతిపై రాంబాబు పెట్రోల్ పోసి తగలబెడుతుండగా ఆమె అక్కతో తనయుడు అడ్డుకున్నాడు. వెంటనే అక్కడ నుంచి రాంబాబు పారిపోయాడు. గ్రామస్థులు వెంటనే గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడు కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News