Friday, March 29, 2024

ప్రేమ వివాహం… దాడి చేసి భార్యను తీసుకెళ్లారని ఫిర్యాదు….

- Advertisement -
- Advertisement -

Lover family attack on groom in Wangara

వరంగల్: ప్రేమ వివాహం చేసుకున్నందకు తన కుటుంబంపై దాడి చేసి తన భార్యను తీసుకెళ్లారని పోలీస్ స్టేషన్‌లో ఓ వ్యక్తి ఫిర్యాదు చేసిన సంఘటన వరంగల్ జిల్లా భీమదేవరపల్లి మండలం రంగయ్యపల్లిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం జైకేశారం గ్రామంలో గంజి స్వాతి, రూపానీ వంశీ గత ఎనిమిది సంవత్సరాల నుంచి ప్రేమించుకుంటున్నారు. కూలాలు వేరు కావడంతో వారి పెళ్లి చేసుకోవడానికి స్వాతి తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. ఇద్దరు మేజర్లు కావడంతో మే 6న నల్లగొండ జిల్లాలోని ఆర్యసమాజంలో పెళ్లి చేసుకున్నారు. వంశీ తన భార్య స్వాతిని తీసుకొని తన స్వగ్రామం రంగయ్యపల్లిలో నివాసం ఉంటున్నాడు. స్వాతి కుటుంబ సభ్యులు రంగయ్యపల్లి వచ్చి వారిపై దాడి చేశారు. అనంతరం స్వాతిని బలవంతంగా అక్కడి నుంచి తీసుకెళ్లారు. ప్రేమ పెళ్లి చేసుకున్న తమను విడదీసేందుకు స్వాతి కుటుంబ సభ్యులు కుట్ర పన్నుతున్నారని, తనకు ప్రాణహాని ఉందని వంగర పోలీస్ స్టేషన్‌లో వంశీ ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తామని పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News