హైదరాబాద్: బాయ్ ఫ్రెండ్ కోసం ఓ యువతి తన నానమ్మ ఇంటికే కన్నం వేసింది. పోలీసుల విచారణలో దొరకడంతో ఇద్దరు కటకటాలు లెక్కపెడుతున్నారు. నేరెడ్మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని డిఫెన్స్ కాలనీకి చెందిన వృద్ధురాలు అమిలియా ఇంట్లో గత నెల 30వ తేదీన దొంగతనం జరిగింది. ఇంట్లోని 18తులాల బంగారు ఆభరణాలు చోరీకి గురయ్యాయి. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేశారు. వృద్ధురాలి మనమరాలు పెట్రిసియా(21)కు నేరెడ్మెట్కు చెందిన అజయ్ గత రెండేళ్ల నుంచి ప్రేమించుకుంటున్నారు.
డీజేగా పనిచేస్తున్న అజయ్ వ్యసనాలకు బానిసగా మారాడు. లాక్డౌన్ కావడంతో వ్యసనాలు తీర్చకునేందుకు డబ్బులు లేవు. దీంతో ప్రేమికురాలి బంగారు చైన్ను అమ్మివేశాడు. కొద్ది రోజుల్లోనే డబ్బులు అయిపోవడంతో మళ్లీ పెట్రిసియాను డబ్బులు అడిగాడు. తన వద్ద లేవని, తన నానమ్మ బంగారు ఆభరణాలు దొంగతనం చేసి విక్రయిద్దామని ప్లాన్ చెప్పింది. దీనికి అంగీకరించిన అజయ్, పెట్రిసియాతో కలిసి వృద్ధురాలి ఇంట్లోని 18 తులాల బంగారు ఆభరణాలు చోరీ చేశారు. కేసు దర్యాప్తు చేసిన పోలీసులు నిందితులను గుర్తించారు. ప్రేమికులు ఇద్దరిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.