- Advertisement -
మేడిపల్లి: మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. మేడిపల్లిలో ప్రేమజంట ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఓ హోటల్ లో ప్రేమికులు పురుగుల మందు తాగారు. ఈ ఘటనలో యువతి మృతి చెందగా, యువకుడి పరిస్థితి విషమంగా ఉండటంతో ఉప్పల్ లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ప్రేమవిఫలమే కారణమై ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు యువతి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది.
lovers attempt suicide in medchal malkajgiri
- Advertisement -