Friday, March 29, 2024

ప్రేమ కోసం ప్రాణాలే వదిలారు

- Advertisement -
- Advertisement -

ఇరువురి తల్లిదండ్రులు నిరాకరించారు.
తమ ప్రేమ సజీవమని అమరులై నిరూపించారు.

Lovers commit suicide in Adilabad

ఆదిలాబాద్: తమ ప్రేమకు మరణం లేదని ప్రేమ సజీవమని ఓ ప్రేమజంట అమరులైన సంఘటన ఆదిలాబాద్ జిల్లా తలమడుడు మండలంలో చోటు చేసుకుంది.  కొంత కాలంగా ప్రేమించుకుంటున్న ఆ ప్రేమ జంటకు ఇరువురి తల్లిందండ్రులు నిరాకరించడంతో తమ ప్రేమ సజీవంగా నిలిచిపోవాలని భావించి మరణంలోను వారి బంధాన్ని విడకుండా ఒకే చోట ఇద్దరు కలిసి ఆత్మహత్యకు పాల్పడ్డారు. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం… మండలంలోని దేహాగమ గ్రామానికి చెందిన గోడం శ్రీరామ్ (25), గేడం సుజాత(19) వీళ్ళిద్దరూ గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. ఇద్దరిది ఒకే గ్రామం ఇరువురి కుటుంబాలు పంతాలకు పట్టింపులకు పోయి పెళ్లికి నిరాకరించడంతో ఈ ప్రేమజంట ఇక తనువు చాలించాలని నిర్ణయం తీసుకుంది. సోమవారం సాయంత్రం ఈ ప్రేమజంట ఇంటి నుంచి బయటకి వెళ్లిపోయారు. రాత్రి అయిన ఇంటికి రాకపోవడంతో వీరి కుటుంబాలు పరిసర ప్రాంతాల్లో వెతికిన ఎక్కడ కూడా వారి ఆచూకీ  కనిపించలేదు. మంగళవారం ఉదయం గ్రామ పోలిమేరల్లో పురుగుల మందు తాగి కనిపించడంతో గ్రామస్థులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించగా శ్రీరామ్ అక్కడికక్కడే మృతి చెంది ఉండగా ప్రాణాపాయ స్థితిలో ఉన్న సుజాతను ఆదిలాబాద్ లోని రిమ్స్‌కి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ యువతి కూడా మృతి చెందింది. ఈ ప్రేమ జంట ఆత్మహత్య పలువురిని కలత చెందించింది. దీంతో గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి. స్థానిక ఎస్సై దివ్య కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News