Thursday, April 25, 2024

పెళ్లికి నో చెప్పిన యువకుడు… ప్రేమజంట ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

Lovers commit suicide in marriage issue

నిజామాబాద్: ప్రేమించిన యువతి పెళ్లి చేసుకొమ్మని అడిగితే స్థిరపడలేదని యువకుడు వివాహం వద్దన్నందుకు యువతి ఆత్మహత్య చేసుకుంది. దీంతో ప్రేమ కోసం సదరు యువకుడు ప్రాణాలు తీసుకున్న సంఘటన నిజామాబాద్ జిల్లా నంది పేట్ మండలం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… అయిల్ పూర్‌కు చెందిన ప్రేమ్ కుమార్(22), ఖుదావంద్‌పూర్‌కు చెందిన సుకన్య(21) గత నాలుగు సంవత్సరాల గాఢంగా ప్రేమించుకుంటున్నారు. గిరిరాజ్ కాలేజీలో ఇద్దరు డిగ్రీ పూర్తి చేశారు. దీంతో అమ్మాయి తల్లిదండ్రులు యువతికి పెళ్లి చేయాలని నిర్ణయం తీసుకున్నారు. తనని పెళ్లి చేసుకోవాలని యువకుడిని యువతి కోరడంతో జాబ్ లేదని, ఇప్పుడు పెళ్లి వద్దని చెప్పాడు. మనస్థాపం చెందిన యువతి ఇంటికెళ్లి ఉరేసుకుంది. ఈ విషయం తెలిసిన యువకుడు ఆయిల్‌పూర్ గ్రామ శివారులో ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ రెండు ఘటనలపై స్థానిక ఎస్ శోభన్ బాబు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News