Saturday, April 20, 2024

ప్రాణం తీసుకున్న పిరికి ప్రేమ….

- Advertisement -
- Advertisement -


నల్లగొండ: ఒకే గ్రామానికి చెందిన అమ్మాయి, అబ్బాయి ప్రేమించుకున్నారు… కుటుంబ సభ్యులకు చెప్పడానికి భయపడ్డారు… యువతికి మరో యువకుడితో పెళ్లి నిశ్చయం కావడంతో ఇద్దరు కలిసి పురుగుల మందు ఆత్మహత్య చేసుకున్న సంఘటన నల్లగొండ జిల్లా తిరుమలగిరి మండలంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తెట్టెకుంట గ్రామంలో కొండల్ (22), సంధ్య(20) మధ్య పరిచయం ప్రేమగా మారింది. సంధ్యకు ఆమె మేనబావతో పెళ్లి నిశ్చయమైంది. పెళ్లి ముహూర్తం పెట్టడాని ఆమె తల్లిదండ్రులు అబ్బాయి ఇంటికి వెళ్లారు. అదే సమయంలో సంధ్య ఇంటికి కొండల్ వెళ్లాడు. ఆమెను విడిచి ఉండలేనని బతకడం వృధా అని తాను ఆత్మహత్య చేసుకుంటానని కొండల్ తన ఇంటికి వెళ్లిపోయాడు. ఆమె కూడా కొండల్ ఇంటికి వెళ్లింది. ఇద్దరు కలిసి పురుగుల మందు తాగారు. సంధ్య నానమ్మ కొండల్ ఇంటికి వచ్చి ఆమెను తీసుకెళ్లింది. ఇంట్లోకి వెళ్లగానే సంధ్య వాంతులు చేసుకోవడంతో కొండల్ ఆమెను బైక్‌పై ఆస్పత్రికి తీసుకెళ్తానన్నాడు. కానీ అప్పటికే ఇద్దరు పురుగుల మందు తాగిన విషయం గ్రామస్థులకు తెలియడంతో 108లో నల్గొండ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఇద్దరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News