Thursday, April 25, 2024

సామాన్యుడిపై గ్యాస్ బండ

- Advertisement -
- Advertisement -

సిటీబ్యూరో ః గ్రేటర్ ప్రజలపై మరోసారి గ్యాస్ ధరల పిడుగు పడింది. రెండేళ్ల కాలంలో నాలుగు సార్లు గ్యాస్ ధరలు పెంచి పేద, మధ్య తరగతి ప్రజల జీవితాలతో కేంద్రం చెలగాటమాడుతుందని నగర వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బుధవారం మరోసారి గృహ వినియోగ వంట గ్యాస్ సిలిండర్ ధరను రూ. 50లు, వాణిజ్య సిలిండర్ ధరలు రూ. 350లు పెంచినట్లు చమురు సంస్దలు ప్రకటించాయి. పెరిగిన ధరతో డొమెస్టిక్ సిలిండర్ ధర రూ. 1155 చేరుకోగా పెరిగిన వెంటనే అమలుల్లోకి వస్తుందని తెలిపాయి. ఏడాదిన్నర కాలంలో గ్యాస్ పెంపు నాలుగోసారి కావడంతో పేద, మధ్యతరగతి ప్రజలు కేంద్ర సర్కార్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతేడాది మార్చి 22వ తేదీన సిలిండర్ ధర రూ. 50, మళ్లీ మే 7న మరో రూ. 50 పెరగ్గా, మే 19వ తేదీన రూ. 3.50 పెంచాయి.

తాజాగా రూ. 50లు పెంచడంతో భవిష్యత్తులో గ్యాస్ సిలిండర్ ధర రూ. 2వేలకు చేరుకుంటుందని మహిళ సంఘాలు పేర్కొంటున్నారు. గత ఐదారు ఏళ్లు సబ్సిడీ బ్యాంకు ఖాతాలో జమ చేసేంది అది కూడా ఎత్తివేసి, కేవలం ఉజ్వల యోజన పథకం కింద వంటగ్యాస్ సిలిండర్ పొందిన వారికే సబ్సిడీ ఇస్తున్నట్లు గ్యాస్ ఏజెన్సీలు పేర్కొంటున్నాయి. రానున్న రోజుల్లో గ్యాస్‌ధర పరిస్దితి చూస్తూంటే పాత కాలం నాటి కట్టెల పొయ్యి వాడే దుస్దితి కనిపిస్తుందని నగరవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ధరలు పెంపుతో పొదుపు జీవితాలు పాటిస్తున్నామని, మళ్లీ గ్యాస్ ధరలు పెరగడంతో నగరంలో జీవించటం కష్టమంటున్నారు. గ్రేటర్ నగరంలో 135 గ్యాస్ ఏజెన్సీలు ఉండగా వాటిలో 28.25లక్షల కనెక్షన్లులు ఉండగా నిత్య 1.10లక్షల సిలిండర్లు వినియోగదారులకు సరఫరా చేస్తున్నారు.

వాణిజ్య సిలిండర్ల పెంపుతో డొమెస్టిక్ సిలిండర్లను చిరువ్యాపారులు బ్లాక్ మార్కెట్‌లో కొనుగోలు చేస్తూ పేదలకు సకాలంలో పంపిణీ చేయకుండా ఏజెన్సీలతో కుట్రలు చేస్తున్నారు. లబ్దిదారులు ప్రశ్నిస్తే స్టాక్ సరిపడలేదని సమాధానం చెబుతూ సిలిండర్లను పక్కదారి పట్టినట్లు విమర్శలు వచ్చాయి. సిలిండర్ల అక్రమాలపై స్దానిక పౌరసరఫరాల అధికారులు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడంలేదని స్దానిక ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News