Thursday, April 25, 2024

నా అంత తెలుగు విష్ణు ప్యానెలో లో ఎవరికి రాదు: ప్రకాశ్ రాజ్ ఫైర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: నా అంత తెలుగు మంచు విష్ణు ప్యానెలో లో ఎవరికి రాదని మా అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న నటుడు ప్రకాశ్ రాజ్  ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈనెల 10న జరగనున్న మా ఎన్నికలో పోటీ చేస్తున్న ప్రకాశ్ రాజ్, మంచు విష్ణుల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. తెలుగు వాడు కాదన్న నరేష్ వ్యాఖ్యలపై ప్రకాశ్ రాజ్ మండిపడ్డారు. ”నా అంత తెలుగు మంచు విష్ణు ప్యానెలో లో ఎవరికి రాదు. నరేష్ అహంకారి, ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. మా ఎన్నికలపై ప్రశ్నిస్తే బెదిరించారు. సౌమ్యంగానే కాదు, కోపంగా మాట్లాడటం కూడా తెలుసు. మా ఎన్నికల్లో జగన్, కెసిఆర్, బిజెపిని లాగుతారా. వైఎస్ జగన్ మీ బంధువైతే మా ఎన్నికలకు వస్తారా. రెండు సార్లు హలో చెబితే కెటిఆర్ ఫ్రెండ్ అయిపోతారా. కొంచెం కోపం, బాధతో వేసే ఓటు సునామిలో మంచు విష్ణు కొట్టుకుపోవాలి. మా ఎన్నికల్లో పెద్దల ఆశీర్వాదం నాకు అవసరం లేదు. మా ఎన్నికల్లో నా సత్తా పై గెలుస్తా. ఆ పెద్దోళ్లను ప్రశ్నించే సత్తా ఉన్నవాడే మా అధ్యక్షుడిగా గెలవాలి” అని పేర్కొన్నాడు.

MAA Elections 2021: Prakash Raj slams Naresh comments

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News