Saturday, April 20, 2024

ఉత్కంఠ భరితంగా మడ్డి

- Advertisement -
- Advertisement -

భారతదేశపు మొట్టమొదటి మడ్‌రేస్ చిత్రం ‘మడ్డి’. ఈ చిత్రాన్ని రెండు తెలుగు రాష్ట్రాల్లో శ్రీ వెంకటేశ్వర ఫిలిం డిస్ట్రిబ్యూటర్స్ ప్రై.లి. పతా కంపై శుక్రవారం దిల్‌రాజు భారీగా విడుదల చే స్తున్నారు. ఇంతకుముందు ఎన్నడూ చూడని కా న్సెప్ట్ తో ఉత్కంఠభరితంగా సాగే ఈ చిత్రంతో డాక్టర్ ప్రగభల్ దర్శకుడిగా పరిచయం అవుతు న్నారు. యువన్, రిధాన్ కృష్ణ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రాన్ని పికె7 క్రియేషన్స్ బ్యాన ర్‌పై ప్రేమ కృష్ణదాస్ నిర్మించారు. ఈ సినిమా విడుదల సందర్భంగా హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దిల్‌రాజు మా ట్లాడుతూ – “మడ్డీ సినిమా మేకింగ్ వీడియోలు, టీజర్, ట్రైలర్ చూడగానే చాలా ఆసక్తికరంగా అ నిపించాయి. అందుకే ఈ సినిమాను తెలుగులో రిలీజ్ చేస్తున్నాను. పాన్ ఇండియా మూవీగా వి డుదలవుతున్న ఈ చిత్రం అన్ని భాషల్లో సక్సెస్ అవుతుందన్న నమ్మకం ఉంది”అని అన్నారు. దర్శకుడు డా.ప్రగభల్ మాట్లాడుతూ – “ఒక యూనిక్ మూవీని ప్రేక్షకులకు అందించాలని మా టీమ్ అందరం ఐదేళ్లు కష్టపడి ఈ మూవీని తెరకెక్కించాం. ఈ సినిమా కోసం ఆఫ్-రోడ్ రే సింగ్‌లో ప్రధాన నటులకు రెండేళ్లు శిక్షణ ఇవ్వ డం జరిగింది”అని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News