Thursday, April 25, 2024

అందరికీ నచ్చే ‘మధుర వైన్స్’..

- Advertisement -
- Advertisement -

Madhura Wines Movie to release on Oct 22

ఎస్ ఒరిజినల్స్, ఆర్.కె.సినీ టాకీస్ బ్యానర్‌పై సన్నీ నవీన్, సీమా చౌదరి, సమ్మోహిత్ ప్రధాన పాత్రల్లో జయ కిషోర్ బండి దర్శకత్వంలో రాజేష్ కొండెపు నిర్మిస్తున్న చిత్రం ‘మధుర వైన్స్’. ఈనెల 22న ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకి వస్తున్న సందర్భంగా ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వివేక్ కూచిబొట్ల, బుచ్చిబాబు, కిషోర్, సందీప్ కిషన్ తదితర సినీ ప్రముఖులు ముఖ్య అతిథిలుగా హాజరై చిత్ర యూనిట్‌కు బెస్ట్ విషెస్ తెలియజేశారు. ఈ సందర్భంగా హీరో సందీప్ కిషన్ మాట్లాడుతూ.. “చిత్ర బృందమంతా షార్ట్ ఫిల్మ్‌ల నుండి వచ్చినా చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించారు. సినిమా గొప్ప విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను”అని తెలిపారు. చిత్ర దర్శకుడు జయ కిషోర్ మాట్లాడుతూ “మా ‘మధుర వైన్స్’ అన్ని అడ్డంకులను దాటుకొని ఈనెల 22న ప్రపంచ వ్యాప్తంగా విడుదలకానుంది. ఈ సినిమా అందరికీ ఖచ్చితంగా నచ్చుతుంది”అని అన్నారు.

Madhura Wines Movie to release on Oct 22

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News