- Advertisement -
దుబాయి: ఐపిఎల్ చరిత్రలోనే అత్యంత విజయవంతమైన కెప్టెన్గా పేరు తెచ్చుకు న్న మహేంద్ర సింగ్ ధోనీకి ఈ ఐపిఎల్ సీజన్ కలిసి రాలేదనే చెప్పాలి. అతని సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్ ఈసారి పేలవమైన ఆటతో అభిమానులను నిరాశకు గురిచేస్తోంది. వరుస ఓటములతో ఇప్పటికే ప్లేఆఫ్ రేసుకు దూరమైంది. దీంతో ధోనీపై ఇంటాబయట విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జట్టు పేలవమైన ప్రదర్శనకు ధోనీ కెప్టెన్సే కారణమనే విమర్శలు సర్వత్రా వినవస్తున్నాయి. వరుస వైఫల్యాలు చవిచూస్తున్న క్రికెటర్లను జట్టులో కొనసాగిస్తూ ప్రతిభావంతులైన క్రికెటర్లపై చిన్నచూపు చూడడాన్ని పలువురు మాజీ క్రికెటర్లు తప్పుపడుతున్నారు. ధోనీ తీసుకుంటున్న నిర్ణయాల వల్లే జట్టుకు వరుస ఓటములు ఎదురవుతున్నాయని మాజీ క్రికెటర్లు శ్రీకాంత్, ఆకాశ్ చోప్రా, ఇర్ఫాన్ పఠాన్ తదితరులు పేర్కొంటున్నారు.
Mahendra Singh Dhoni faced criticism
- Advertisement -