Wednesday, April 17, 2024

మహేష్ బాబు యూరప్ ట్రిప్.. ఫోటోలు వైరల్

- Advertisement -
- Advertisement -

 

హైదరాబాద్: అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రం సక్సెస్ సంబరాలు, ప్రమోషన్స్ తో బిజీబిజీగా గడిపిన సూపర్ స్టార్‌ మహేష్ బాబు కాస్త విశ్రాంతి కోసం తన కుటుంబంతో కలిసి యూరప్ ట్రిప్ కు వెళ్లాడు. ఈ సందర్భంగా ఎయిర్ పోర్టులో తన కుమారుడు గౌతమ్‌, కూతురు సితారతో కలిసి మహేష్ దిగిన ఫొటోలు సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. అలాగే, ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న తన భార్య నమ్రతకు ట్వీట్టర్ వేదికగా మహేష్ శుభాకాంక్షలు తెలిపాడు. మూడు నెలల యూరప్ ట్రిప్ అనంతరం మహేష్ తిరిగి కొత్త సినిమా షూటింగ్ లో పాల్గొననున్నాడు. తనకు ‘మహర్షి’ వంటి భారీ హిట్ ఇచ్చిన దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తన తదుపరి చిత్రం చేయనున్నట్లు మహేష్ ప్రకటించిన విషయం తెలిసిందే.

 Mahesh Babu US Holiday Trip Photos Viral

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News