- Advertisement -
భైంసా: నిర్మల్ జిల్లాలోని బైంసా మండలంలోని దేగాం గ్రామానికి చెందిన లాబ్ది పోతన్న (45) మద్యానికి బానిసై ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు రూరల్ ఎస్సై పులి పున్నం చందర్ తెలిపారు. ఎస్సై కథనం ప్రకారం.. మృతుడు కూలిపని చేసి జీవనం గడుపుతున్నాడు. గత కొంత కాలం నుంచి మద్యానికి బానిస కావడంతో అప్పులు చేశాడు. దీంతో భార్యాభర్తల మధ్య తరచూ గొడవ జరిగేదన్నారు. గురువారం తాగి ఇంటికి రావడం వల్ల భార్యభర్తల మధ్య మళ్లీ గొడవ జరిగింది. అదే రోజు భార్య తన ఇంటి నుండి బంధువుల ఇంటికి వెళ్లిపోయింది. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో మద్యం మత్తులో ఉన్న పోతన్న ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడినట్టు ఆయన తెలిపారు. మృతుడికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించినట్టు ఎస్సై తెలిపారు.
- Advertisement -