Thursday, April 25, 2024

వివాహేతర సంబంధం… తల్లిని హత్య చేసి…

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: వివాహేతర సంబంధం పెట్టుకుందని తల్లిని తనయుడు హత్య చేసిన సంఘటన కర్నాటకలోని హవేరి జిల్లాలో జరిగింది. అతడిపై తల్లిని అత్యాచారం చేసిన ఆరోపణలు కూడా వస్తున్నాయి. శిగామ్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… వణహళ్లి ప్రాంతంలో 15 సంవత్సరాల క్రితం భర్త చనిపోవడంతో ఓ ఆవిడ ఇంటి పక్కనున్న వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ విషయం కుమారుడికి తెలియడంతో పలుమార్లు తల్లిని మందలించాడు. ఆమెలో మార్పురాకపోవడంతో ఆమె ప్రియుడితో గొడవపెట్టుకున్నాడు. వివాహేతర సంబంధం మానుకోవాలని తల్లికి కుమారుడు పలుమార్లు చెప్పాడు. తల్లి, తనయుడు కలిసి గంగిభావి రోడ్డులోని జోన్న చేనులో పనికి వెళ్లారు. నవంబర్ 12న తల్లి వివాహేతర సంబంధం విషయంలో ఇద్దరు మధ్య గొడవ జరిగింది. గొడవ శ్రుతి మించడంతో తల్లి నెట్టేశాడు. ఆమె కిందపడిపోవడంతో గొంతు నులిమి హత్య చేశాడు. కానీ తల్లిపై అత్యాచారం చేసిన ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. అక్కడి నుంచి నిందితుడు పారిపోయాడు. తల్లి కోసం కుమార్తె తన భర్తతో కలిసి గంగిభావి వద్దకు వచ్చింది. జోన్న చేనులో తల్లి మృతదేహం కనిపించడంతో స్థానిక పోలీస్ స్టేషన్‌ కు సమాచారం ఇచ్చింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి నిందితుడిని పట్టుకున్నారు. హత్య చేశానని ఒప్పుకున్నారు. నిందితుడిపై ఐపిసి 376, 302 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News