చెన్నై: తమిళనాడులోని కారైక్కాల్ ఒడుదురై ప్రాంతంలో ఆదివారం విషాదం చోటుచేసుకుంది. పెద్దలను ఎదిరించి సహజీవనం కొనసాగిస్తున్న ఓ జంట బలవన్మరణానికి పాల్పడింది. కారైక్కాల్ సమీపంలోని తిరునల్లారుకు చెందిన దిలీప్ (26)కు, నిరావీకి చెందిన శివానీ(30) అనే హిజ్రాతో 6 నెలల క్రితం పరిచయం ఏర్పడి.. ఆ తర్వాత ప్రేమగా మారింది. వియషం తెలుసుకున్న తల్లిదండ్రులు దిలీప్ ను మందలించారు. శివానీని మర్చిపోలేనని దిలీప్ తల్లిదండ్రులకు తేల్చిచెప్పాడు. నెలరోజుల క్రితం ఇంట్లో వెల్లిపోయిన దిలీప్ కారైకాల్ ఒడుదురైలో కాపురం పెట్టాడు. కొన్నిరోజులు బాగానే గడిచిన వీరి కాపురం ఏమైందో కానీ శనివారం ఇద్దరూ ఇంట్లో ఉరేసుకుని ఆత్మచేసుకున్నారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. అనంతరం కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Man And Hijra Committed Suicide At Tamil Nadu