Friday, March 29, 2024

మేడ్చల్‌లో డ్రగ్స్ సరఫరా చేస్తున్న వ్యక్తి అరెస్ట్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఎస్ వోటీ, పోలీసులు మంగళవారం మెరుపుదాడులు నిర్వహించారు. ఈ తనిఖీల్లో డ్రగ్స్ సరఫరా చేస్తున్న వ్యక్తిని అరెస్ట్ అయ్యాడు. నిందితుడిని పోతిరెడ్డి మెహర్ బాబాగా గుర్తించారు. నిందితుడి నుంచి 41 గ్రాముల ఎండిఎంఏ, మొబైల్ ఫోన్లు, నగదు స్వాధీనం చేసుకున్నామని అధికారులు వెల్లడించారు. ఢిల్లీకి చెందిన జిన్నీ అనే వ్యక్తి పరారైనట్లు తెలుస్తోంది. పట్టుబడిన డ్రగ్స్ విలువ రూ. 3.8 లక్షలు ఉంటుందని మేడ్చల్ ఏసిపి మీడియా సమావేశంలో వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News