Friday, April 19, 2024

పాత కక్షలు.. అన్న స్నేహితుడిని చంపిన తమ్ముడు

- Advertisement -
- Advertisement -

పటాన్ చెరు: సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు మండలం లక్డారంలో దారుణం చోటుచేసుకుంది. పాతకక్షలతో ఓ వ్యక్తి హత్యకు గురయ్యాడు. నెల రోజుల క్రితం స్నేహితులతో ఉండగా జగన్ నీటిలో పడి చనిపోయాడు. స్నేహితుల మూలంగానే జగన్ చనిపోయాడని అతని సోదరుడు శంకర్ భావించాడు. ఈ నేపథ్యంలోనే జగన్ స్నేహితుడు మేఘన రాజును శంకర్ దారుణంగా హత్య చేశాడు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించి విచారణ చేస్తున్నారు. అనంతరం దర్యాప్తు చేస్తున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News