బెంగళూరు: మామను అల్లుడు కత్తితో పొడిచిన సంఘటన కర్నాటకలోని బెంగళూరు ప్రాంతం మరాతాహల్లి ప్రాంతంలో జరిగింది. అల్లుడిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. బొమ్మనహలీల్ గ్రామానికి చెందిన అన్నయప్ప తన కూతురును మంజునాథాకు ఇచ్చి పెళ్లి చేశాడు. మంజునాథా దంపతులకు ఒక కూతురు జన్మించింది. కూతురు జన్మించడం మంజునాథా కుటుంబ సభ్యులకు ఇష్టం లేదు. కూతురు పుట్టడంతో అత్తాగారింటి వారితో పలుమార్లు మంజునాథా గొడవ దిగడంతో పాటు భార్యను ఇంటికి తీసుకెళ్లలేదు. అన్నయప్ప తన ఇద్దరు కుమారులు, మరోక వ్యక్తితో కలిసి అల్లుడుతో మాట్లాడుదామని వచ్చారు. మంజునాథా, అతడి సోదరుడు, మరోక వ్యక్తితో అన్నయప్ప కుటుంబ సభ్యుల మాట్లాడుతుండగా గొడవ జరిగింది. మంజునాథా కత్తి తీసుకొని అన్నయప్ప వీపుపై పొడిచాడు. వెంటనే అతడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి మంజునాథాను అరెస్టు చేశారు.