Thursday, March 28, 2024

కులాల మధ్య ఘర్షణ… మొండెం నుంచి తలను వేరు చేసి…. యువకుడి హత్య

- Advertisement -
- Advertisement -

Man brutally beheaded in Tamil Nadu

 

చెన్నై: తమిళనాడులోని ట్యూటికోరిన్ ప్రాంతంలో ఓ యువకుడిని 35 సార్లు కత్తులతో పొడిచి అనంతరం మొండెం నుంచి తలను వేరు చేసి 400 మీటర్ల దూరంలో పడేశారు. ఈ కేసులో పది మంది నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. కీలా కీరానుర్, తలైవన్‌వాడలి అనే గ్రామాలు పక్కపక్కనే ఉన్నాయి. కిలా కీరానుర్ అనే గ్రామంలో దళితులు ఎక్కువగా నివసిస్తున్నారు.

గత సంవత్సరం ఇతర వర్గానికి సంబంధిచిన వ్యక్తి చనిపోతే కీలాకీరానుర్ గ్రామస్థులు తమ గ్రామంలో దహనం చేయడానికి వీలు లేదని అడ్డు చెప్పారు. తలైవన్‌వాడలి గ్రామానికి చెందిన పి. సత్యమూర్తి అనే యువకుడు(23) వాళ్లకు వ్యతిరేకంగా ఆ గ్రామంలో దహనం చేయడంతో గొడవలు జరిగాయి. సత్యమూర్తిపై ఎస్‌సి, ఎస్‌టి ఎట్రాసిటీతో పాటు హత్యాయత్నం కేసులు నమోదయ్యాయి. శుక్రవారం మధ్యాహ్నం ఇంటి నుంచి వెళ్లిన సత్యమూర్తి రాత్రి రాకపోవడంతో తలైవన్‌వాడలి అనే గ్రామస్థులు వెతకడం ప్రారంభించారు. గ్రామ శివారులో తల లేని సత్యమూర్తి మృతదేహం కనిపించడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. రెండు గ్రామాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది.

రెండు గ్రామాల మధ్య గొడవలు జరగకుండా 500 మంది పోలీసుల పహారా కాస్తున్నారు. శవ పరీక్ష నిమిత్తం మృతదేహాన్ని పోలీసులు తీసుకెళ్తుండగా గ్రామస్థులు అడ్డుకొని తలను తీసుకొచ్చిన తరువాత మృతదేహాన్ని తీసుకెళ్లాలని ధర్నాకు దిగారు. దీంతో పోలీసులు ఘటనా స్థలం నుంచి 400 మీటర్ల దూరంలో తలను గుర్తించారు. మృతదేహంతో పాటు తలను శవ పరీక్ష నిమిత్తం తూతుకుడి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతదేహంపై 35 కత్తిపోట్లు ఉన్నాయని పోస్టుమార్టమ్‌లో తేలింది. ఈ కేసులో నిందితులు పది మంది దళితులేనని పోలీసులు వెల్లడించారు. పది మందిపై కేసు నమోదు చేసి అరెస్టు చేశామని స్థానిక ఎస్‌పి వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News