Friday, March 29, 2024

హిమాయత్ సాగర్ వద్ద దారుణ హత్య

- Advertisement -
- Advertisement -
Man Brutally Murdered in Himayat Sagar
వరుస నేరాలపై డిజిపి సీరియస్

హైదరాబాద్ : రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో హిమాయత్ సాగర్ చెరువు వద్ద సత్యనారాయణ తలపై బండరాయితో మోది గుర్తుతెలియని వ్యక్తులు దారుణ హత్యకు పాల్పడ్డారు. ఈక్రమంలో నగరంలో వరుస హత్యలు, నేరాలపై డిజిపి మహేందర్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిందితులను అనతికాలంలో గుర్తించాలని స్థానిక పోలీసు అధికారులకు ఆదేశాలిచ్చారు. ఈ క్రమంలో హిమాయత్ సాగర్ చెరువు సమీపంలో హత్యకు సత్యనారాయణ హైదర్‌షాకోట్ మాధవి నగర్ కు చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు.

సత్యనారాయణ హత్యపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని రాజేంద్రనగర్ పోలీసులు వివరిస్తున్నారు. అదేవిధంగా నగరంలో ఒకేరోజు నాలుగు హత్యలు జరగటంతో ఆయా ఘటనలపై దర్యాప్తు వేగవంతం చేయాలని కమిషనర్లకు, డిసిపిలను డిజిపి కోరారు. ఈక్రమంలో లంగర్‌హౌస్‌లోని ఎండి లైన్స్‌లో కారుతో బైక్‌ను ఢీకొట్టి మహ్మద్ హత్య కేసులో విచారణ చేపట్టిన పోలీసులు అతనిపై గోల్కొండ పోలీస్టేషన్‌లో అనేక కేసులతో పాటు రౌడీషీట్ ఉన్నట్లు తేలింది. ఈక్రమంలో లంగర్ హౌస్ లోని సంఘటనాస్థలాన్ని హైదరాబాద్ సిపిఅంజనీకుమార్ పరిశీలించారు.

అనంతరం ఫోరెన్సిక్ నిపుణులు ఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలను సేకరించారు. నిందితుల్ని త్వరలోనే పట్టుకుంటామని.. హత్యలకు గల కారణాలేమిటనేది దర్యాప్తులో తెలుస్తుందని సిపి తెలిపారు. అలాగే గోల్కొండలో రాహుల్ అనే యువకుడిని అతని మిత్రుడు అజార్ హత్య చేశాడు. అటు రెయిన్ బజార్ లో కూడా మరో హత్య జరిగింది. ఇమ్రాన్ అనే యువకుడిని అతని బంధువులే హత్య చేశారు.అలాగే గోల్కొండ పోలీస్టేషన్ పరిధిలోనే మరో హత్యాయత్నం జరిగింది.

షారుఖ్ అనే వ్యక్తి అర్భాజ్ సోదరిపై కామెంట్ చేయటంతో షారుఖ్‌పై అర్భాజ్ దాడి చేశాడు. ఈ దాడీలో తీవ్రంగా గాయపడిన షారుఖ్‌ను దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. నగరం, శివారులలో వరుస నేరాలు చోటుచేసుకోవడంతో డిజిపి ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు వెంటనే ఆయా కేసులలో నిందితులను అరెస్ట్ చేయాలని స్థానిక పోలీసులకు ఆదేశించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News