Thursday, March 28, 2024

భార్యను చంపి ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

Man commits suicide after killing wife at khammam

 

ఖమ్మంలో దారుణ ఘటన
అమెరికా వెళ్లే విషయంలో భార్య భర్తల మధ్య తలెత్తిన గొడవలే కారణం?

ఖమ్మం: భార్యను హత్య చేసి భర్త తనువు చాలించిన సంఘటన ఖమ్మం జిల్లాలో తల్లాడ మండల పరిధిలోని రంగంబంజర్ గ్రామంలో జరిగింది. స్థానికులు తెలిపిన కథనం ప్రకారం… సంక్రాంతి సుబ్రహ్మణ్యేశ్వరరావు (65) గత 30 సంవత్సరాల క్రితం గుడివాడ నుంచి వచ్చి రంగంబంజర్‌లో స్థిరపడి నివాసముంటున్నాడు. భార్య విజయలక్ష్మి (55) కాగా వీరికి ఇద్దరు కుమార్తెలున్నారు. మొదటి కుమార్తె గోదావరి ఖనిలో ఉద్యోగం చేస్తుంది. రెండవ కుమార్తె అమెరికాలో ఉద్యోగం చేస్తుండటంతో వీరి ఇరువురు అమెరికా వెళ్ళే విషయంలో గొడవపడి మానసిక ఒత్తిడికిలోనై మంగళవారం అర్ధరాత్రి ఆవేశంతో సుబ్రహ్మణేశ్వరరావు భార్యను గొడ్డలితో నరికి హత్య చేసి అతను కూడా పురుగులమందు సేవించి ఆత్మహత్య చేసుకున్నాడు.

బుధవారం ఉదయం పాలు పోయటానికి వచ్చిన వ్యక్తి తలుపు తట్టగా ఎటువంటి స్పందన రాకపోవటంతో తలుపు తీసి చూడగా విజయలక్ష్మి రక్తపు మడుగులో విగత జీవిగా, సుబ్రహ్మణ్యేశ్వరరావు కొనఊపిరితో ఉండటం చూసి అతను చుట్టు ప్రక్కల వారికి సమాచారం అందజేశాడు. సుబ్రహ్మణ్యేశ్వరరావును కల్లూరు ప్రైవేటు ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతి చెందాడు. హత్య జరిగిన విషయం తెలుసుకున్న తల్లాడ పోలీసులు ఎడిషనల్ ఎస్పీ స్నేహ, వైరా ఏసిపి సత్యనారాయణ, సిఐ వసంత్‌కుమార్, వైరా ఎస్‌ఐ సురేష్, హెడ్ కానిస్టేబుల్ సాంబశివరావు, బాలకృష్ణ సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి పంచనామా జరిపి వేలిముద్ర నిపుణులతో వివిధ కోణాలతో దర్యాప్తు చేస్తున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News