- Advertisement -
మనతెలంగాణ/నాంపల్లి: రైలు ప్రమాదంలో ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు. ఈ ఘటన నాంపల్లి రైల్వే పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్నది. రైల్వే పోలీసుల కథనం.. గుర్తు తెలియని(40) వ్యక్తి బొరబండ, హైటెక్ సిటీ రైల్వేస్టేషన్ల మద్య పట్టాలు దాటుతున్నారు. ఈ క్రమంలో వేగంగా దూసుకొచ్చిన రైలు సదరు వ్యక్తిని ఢీకొన్నది. ఈ ప్రమాదంలో అతనికి శరీరంలో పలు చోట్ల తీవ్రగాయాలు కావడంతో పట్టాలు రక్తసిక్తమయ్యాయి. ఆనంతరం అక్కడే అతను విగతజీవిగా మారాడని పోలీసులు తెలిపారు. మృతుడు తెల్ల చొక్క, నలుపు రంగు డ్రాయర్ ధరించారని పోలీసులు వెల్లడించారు. ఇతర వివరాల కోసం మృతుడి సంబంధించిన కుటుంబం, బంధుమిత్రులు ఎవరైన ఉంటే వెంటనే 040-23202238 నెంబర్ను సంప్రదించాలని పోలీసులు కోరారు.
Man dead in Train Accident at Nampally Station
- Advertisement -