Friday, March 29, 2024

ప్రమాదవశాత్తు చెరువులో పడి వ్యక్తి మృతి

- Advertisement -
- Advertisement -

Man died after accidentally falling into Pond

 

మనతెలంగాణ/జవహర్‌నగర్ : చేపలు పట్టడానికి వెళ్లి ప్రమాదవశాత్తు చెరువులో పడి ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన మంగళవారం జవహర్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని హకీంపేటలో చోటుచేసుకుంది. ఇన్‌స్పెక్టర్ భిక్షపతిరావు తెలిపిన వివరాల ప్రకారం సికింద్రాబాద్ రసూల్‌పుర ఇందిరమ్మనగర్ బస్తీకి చెందిన తాండ చంద్రకాంత్(33)అనే యువకుడు తన స్నేహితుడు నందులాల్‌తో కలిసి హకీంపేట చెరువులో చేపలు పట్టడానికి వచ్చి ప్రమాదవశాత్తు అందులో పడి మృతి చెందాడు. ఈ మేరకు సమాచారం అందుకున్న జవహర్‌నగర్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకోని మృతదేహాన్ని బయటకు తీసి ఫోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకోని ధర్యాప్తు చేస్తున్నట్లు ఇన్‌స్పెక్టర్ భిక్షపతిరావు తెలిపారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News