Saturday, April 20, 2024

మదర జలపాతంలో గల్లంతైన యువకుడు మృతి..

- Advertisement -
- Advertisement -

కొమురం భీమ్ అసిఫాబాద్: జిల్లాలో తిర్యాని మండలంలోని చింతల మదర జలపాతంలో ఆదివారం రోజున గల్లంతైన ప్రతాప్ చౌదరి మృతదేహం లభ్యమైనట్లు తిర్యాణి ఎస్సై రామారావు తెలిపారు. ఎస్ఐ తెలిపిన వివరాల ప్రకారం.. ప్రతాప్ చౌదరి తన స్నేహితులతో కలిసి తిర్యాణి మండలంలోని చింతల మధర జలపాతం అందాలను చూడడానికి రాగా.. ప్రమాదవశాత్తు జలపాతంలో పడి గల్లంతయ్యాడు. దీంతో తన తోటి స్నేహితులు సమాచారం ఇవ్వడంతో పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని గాలింపు చర్యలు చేపట్టారు. చీకటి పడడంతో గాలింపు చర్యలు నిలిపి వేసి తిరిగి సోమవారం ఉదయం ప్రారంభించగా జలపాతంలో ప్రతాప్ చౌదరి మృతదేహం లభ్యమైంది. మృతుని తండ్రి శంకర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ తెలిపారు.

Man died as washed out at Mathura Waterfall in Asifabad

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News