Thursday, March 28, 2024

కర్నాటకలో హృదయవిదారక ఘటన

- Advertisement -
- Advertisement -

Man Died in Doctors Negligence at Karnataka

బెంగళూరు: కర్నాటక రాష్ట్రంలో హృదయవిదారక సంఘటన చోటుచేసుకుంది. ఆసుపత్రిలో వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, తనను వెంటనే డిశ్చార్జ్ చేయాలని వేడుకున్న ఓ యువకుడు 24గంటల వ్యవధిలోనే మృతి చెందాడు. కర్నాటక బెంగళూరుకు చెందిన యువకుడు జ్వరంతో గతవారం ఆక్స్ ఫర్డ్ ఆస్పత్రిలో చేరాడు. శుక్రవారం విడుదలైన ఓ వీడియోలో తనను ఆస్పత్రి సిబ్బంది పట్టించుకోవడం లేదని, తనను తక్షణమే డిశ్చార్జ్ చేయాలని సదురు యువకుడు వేడుకున్నాడు. ఈ క్రమంలో శనివారం నాటికి పూర్తిగా ఆరోగ్యం విషమించడంతో ప్రాణాలు కోల్పోయాడు. కొడుకు మరణవార్త విన్న తల్లి తల్లడిల్లిపోయి, కన్నీరుమున్నీరుగా విలపించింది. వైద్యుల నిర్లక్ష్యంతోనే తన బిడ్డ మృతి చెందాడని ఆరోపించింది.

Man Died in Doctors Negligence at Karnataka

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News