Thursday, April 25, 2024

గాంధీలో కరోనాతో వ్యక్తి మృతి

- Advertisement -
- Advertisement -

Gandhi Hospital

 

ఏడుకు చేరిన మరణాల సంఖ్య
వైద్యులపై దాడి చేసిన మృతుడి తమ్ముడు
దాడిని ఖండించిన మంత్రి ఈటల

మన తెలంగాణ /హైదరాబాద్ : గాంధీ ఆసుపత్రి లో కరోనాతో మరో వ్యక్తి మృతి చెందాడు. దీంతో రాష్ట్రంలోని కరోనా మరణాల సంఖ్య ఏడుకి చేరిం ది. నిర్మల్ పట్టణానికి చెందిన అన్నదమ్ములు కరో నా లక్షణాలతో మంగళవారం గాంధీలో చేరారు. చికిత్స పొందుతూ తన అన్న చనిపోవడంతో తట్టుకోలేక కరోనా పక్క వార్డులో ఉన్న మృతుడి తమ్ముడు వైద్యులపై, సెక్యూరిటి గార్టులపై దాడికి పాల్పడ్డాడు. దీంతో అక్కడ ఉన్న సిబ్బంది పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఘటనా స్థలికి చేరుకున్న సిసి అంజనీకుమార్ పరిస్థితిని చక్కదిద్దారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా చర్యలు తీసుకున్నారు. ఇదిలా ఉండగా ఈ దాడిని సూపరింటెండెంట్ ఖండించారు. క్లిష్ట పరిస్థితులలో సేవలందిస్తున్న వైద్యులపై దాడి చేయడం సరికాదన్నారు.

చనిపోయిన వ్యక్తి వయస్సు 50 ఏళ్లు ఉన్నట్లు సమాచారం. గాంధీ ఆసుపత్రిలో జరిగిన దాడిని ఖండిస్తున్న మంత్రి ఈటల రాజేందర్ ప్రకటనలో తెలిపారు. ఇలాంటి వారిని ఎట్టి పరిస్థితులలో క్షమించమని, దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. డాక్టర్లు, వైద్య సిబ్బంది తమ ప్రాణాలు పణంగా పెట్టి ప్రజల ప్రాణాలు కాపాడుతుంటే వారిని కొట్టడం ఏమిటని? ఆయన ప్రశ్నించారు. డాక్టర్స్‌పై దాడి చేయడం హేయమైన చర్యని, ఇలాంటి గంభీరమైన సమయంలో ఈ ఘటనలు మంచివికావన్నారు. 24 గంటలు డాక్టర్లు ప్రజలు కోసం పనిచేస్తున్నారని, వారికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని తెలిపారు. ప్రతి డాక్టర్‌కు రక్షణ కల్పిస్తామని, భరోసాతో పనిచేయాలని, మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తామని మంత్రి తెలిపారు.

దాడిని ఖండించిన బండి సంజయ్
గాంధీలో వైద్యులపై దాడిని బిజేపి ఎంపి, రాష్ట్ర అధ్యక్షుడు ఖండించారు. ప్రజల ప్రాణాలను కా పాడే వైద్యులపై దాడి మంచిదికాదన్నారు. ఇలాం టి చర్యలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.

పోలీసులపై తిరగబడ్డ స్థానికులు…
హైదరాబాద్ మహానగరంలో మరో ఘటన చోటుచేసుకుంది. కరోనా వైరస్ కారణంగా చనిపోయిన ఓ వ్యక్తి మృతదేహాన్ని ఖననం చేయడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. కరోనా వైరస్‌తో మరణించిన ఓ వ్యక్తిని నగరంలోని చాదర్‌ఘాట్ కాంగానగర్‌లోని ఓ శ్మశాన వాటికకు ఖననం చేసేందుకు రెయిన్ బజార్ పోలీసులు తీసుకొచ్చారు. అయితే ఆ మృతదేహంపై వైరస్‌ను నియంత్రించే ఏలాంటి రసాయనాలను పిచికారీ చేయకుండానే ఏలా తీసుకొచ్చారంటూ పోలీసులను స్థానికులు నిలదీశారు. కనీస ముందు జాగ్రత్తలు తీసుకోకుండా ఏలా ఖననం చేస్తారంటూ స్థానికులు ఎస్‌ఐపై మండిపడ్డారు. ఎంత నచ్చజెప్పేందుకు ప్రయత్నించినా.. వినకపోవడంతో కాచిగూడ పోలీసులు ప్రవేశించి స్థానికులను శాంతింపజేశారు.

 

Man died with corona in Gandhi Hospital
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News