Friday, April 26, 2024

కరెంటు స్తంభం విరిగిపడి వ్యక్తి మృతి

- Advertisement -
- Advertisement -

Man dies as electricity pole in sangareddy

సంగారెడ్డి: బైక్ పై తండ్రి, తనయుడు  వెళ్తున్న క్రమంలో విద్యుత్ స్తంభం విరిగిపడడంతో తండ్రి అక్కడిక్కడే దుర్మరణం చెందిన సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలం బిడిఎల్ లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… రామచంద్రాపురం మండలం వెలిమల గ్రామానికి చెందిన నర్సింహులు(44) తన కుమారుడు రాజుతో కలసి బైక్ పై పటాన్‌చెరు వైపు వెళ్తున్నారు. ఈ క్రమంలో పటాన్‌చెరు వైపు నుంచి వేగంగా వెళ్తున్న రెడి మిక్స్ వాహనం వెళ్తున్న క్రమంలో పాఠి గ్రామ శివారులో విద్యుత్ తీగలకు తగలడంతో ఆ వేగానికి స్తంభం విరిగి బైక్ వెళ్తున్న నర్సింహులుపై ముక్క పడింది.  తీవ్రంగా గాయపడిన నర్సింహులు ఘటనా స్థలంలోనే దుర్మరణం చెందాడు. కుమారుడు చిన్నపాటి గాయాలతో బయటపడ్డాడు. స్థానికుల సమాచారం మేరకు బిడిఎస్ ఎస్ఐ  వెంకటరెడ్డి  ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News