Wednesday, April 24, 2024

రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి..

- Advertisement -
- Advertisement -

చేగుంట: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన సంఘటన చేగుంట మండలం రెడ్డిపల్లి గ్రామ శివారులోని జాతీయ రహదారి 44 పై చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం చేగుంట గ్రామానికి చెందిన గంగాదర్ తన కూతురుతో బైక్‌పై వెళ్తుండగా రెడ్డిపల్లి బైపాస్ వద్ద డీసీఎం ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో ఈరముష్టి గంగాదర్ (48) తండ్రి బాలయ్య,అక్కడికక్కడే మృతి చెందగా, కూతురు రవళికి తీవ్ర గాయాలు అయినవి.తీవ్రంగా గాయపడిన అమెను రామాయంపేట ఆసుపత్రికి తరలించారు. గంగాదర్ ఫిర్యాదు  మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహన్ని పోస్టు మార్టం నిమిత్తం ఎరియా అసుపత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News