- Advertisement -
అమరావతి: యువకుడికి భార్య ఉంది… మరో యువతితో ప్రేమలో పడి ఆమెతో పారిపోయిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు జిల్లా పుంగనూరు మండలం మేలుపట్లలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ఫీయాజ్ అనే వ్యక్తి కొత్తయిండ్లలోని ఓ జనరల్ స్టోర్లో కూలీగా పని చేస్తున్నాడు. అదే దుకాణంలో మరో యువతి పని చేస్తోంది. ఫీయాజ్కు సంవత్సరం క్రితం బాలవీధికి చెందిన యువతితో పెళ్లి జరిగింది. దుకాణంలో పని చేస్తున్న యువతితో ప్రేమలో పడ్డాడు. పెళ్లి చేసుకోవాలని ఇద్దరు నిర్ణయం తీసుకున్నారు. కుటుంబ సభ్యులు ఒప్పుకోకపోవడంతో ఇద్దరు కలిసి కర్నాటకకు పారిపోయారు. ఇరు కుటుంబాలు వారిని స్థానిక పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తుండగా ఎలుకల మందు తాగేశారు. వెంటనే వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు.
- Advertisement -