రాయ్పూర్: ఛత్తీస్గఢ్లోని జష్పూర్ జిల్లాలో ఓ వ్యక్తి క్వారంటైన్ నుంచి తప్పించుకొని భార్యకు వివాహేతర సంబంధం ఉందని అనుమానించి ఆమె చేతిని నరికాడు. దీంతో భర్తను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. లలిత్ కోర్వా అనే వ్యక్తికి పియార్ బాయ్ అనే భార్య ఉంది. వాళ్లకు ఒక కుమారుడు కూడా ఉన్నాడు. కరోనా సోకిన వ్యక్తితో లలిత్కు ప్రైమరీ కాంటాక్ట్ ఉండడంతో అధికారులు అతడిని క్వారంటైన్లో ఉంచారు. క్వారంటైన్లో ఉంటూ భార్యకు పలుమార్లు ఫోన్ చేశాడు. ఎప్పుడు ఫోన్ చేసిన ఆమె ఫోన్ బిజీగా ఉండడంతో భార్యపై అనుమానం పెట్టుకున్నాడు. క్వారంటైన్ నుంచి తప్పించుకొని ఇంటికి వెళ్లాడు. అప్పడికే భార్య ఫోన్లో మాట్లాడుతుండడంతో గొడ్డలి తీసుకొని ఆమె చేయి నరికాడు. అనంతరం అక్కడి నుంచి తప్పించుకున్నాడు. గ్రామస్థులు ఆమెను స్థానిక ఆస్పత్రికి తరలించారు. రెండుగా విడిపోయిన చేతిని వైద్యులు అతికించారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని స్థానిక ఎస్ఐ హెచ్ఆర్ భగత్ తెలిపాడు.