Thursday, April 25, 2024

ప్రాణం మీదకు తెచ్చిన ఉరి నాటకం…

- Advertisement -
- Advertisement -

man hanging drama in Ranga Reddy District

రంగారెడ్డి: మద్యం మత్తులో సరదాగా చేసిన పని ఒకరి ప్రాణాలమీదకు తెచ్చుకున్న సంఘటన రంగారెడ్డి జిల్లా నందిగామ మండలంలోని అప్పారెడ్డిగూడలో ఆదివారం చోటుుచేసుకుంది. పుట్టింటికి వెళ్లిన భార్యను ఇంటికి రప్పించాలని ఓ వ్యక్తి మద్యం మత్తులో ఉరివేసుకున్నాడు. స్నేహితుడు ఫోన్ లో వీడియో తీస్తుండగానే చెట్టుకు తాడు కట్టి దానిని మెడకు కట్టుకున్నాడు. తీర ముడి కాస్త గొంతుకు బిగుసుకుపోవడంతో ఊపిరాడక అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. లాక్ డౌన్ కావడంతో జగన్, శ్రీను అనే మిత్రులు సరదాగా గ్రామ శివారులోని చెట్టు కింద మద్యం సేవించారు. మత్తులో ఉన్న ఇద్దరు స్నేహితులు పుట్టింటికి వెళ్లిన తమ భార్యలను ఇంటికి రప్పించాలని ఉరి నాటకం ఆడారు. మెదట జగన్ ఊరి వేసుకున్నట్లు నాటకం ఆడగ, శ్రీను ఫోన్లో వీడియో తీశాడు. ఉన్నట్టుండి జగన్ కు ఊపిరి ఆడకపోవడం అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. జగన్ ను గమనించిన శ్రీను స్థానికులతో కలిసి ఆస్పత్రికి తరలించాడు. వీడియో విషయం తర్వాత బయటకు రాగా బాధితుడి తండ్రి శ్రీనుపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

man hanging drama in Ranga Reddy District

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News