Thursday, April 18, 2024

వీడియో తీస్తుండగా బుల్లెట్ తగిలి వ్యక్తి మృతి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: వీడియో రికార్డ్ చేస్తుండగా బుల్లెట్ తగిలి వ్యక్తి మృతి చెందిన సంఘటన బీహార్ లోని నౌగాచియాలో చోటు చేసుకుంది. వివరాలలోకి వెళితే ..స్థానికుల కథనం ప్రకారం.. నౌగాచియాలో రెండు వర్గాల మధ్య ఘర్షణ జరుతుండగా ఇంటి పై నుంచి ఓ వ్యక్తి వీడియో తీస్తున్నాడు.

ఇంతలో ఒకరు కాల్చిన బుల్లెట్ నేరుగా వీడియో తీస్తున్న వ్యక్తికి తగిలింది.దీంతో బుల్లెట్ తగిలిన వ్యక్తి సంఘటన స్థలంలోనే మృతి చెందాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News