Thursday, April 25, 2024

మావోయిస్టులు అమర్చిన బాంబు పేలి యువకుడికి తీవ్ర రక్తస్రావం..

- Advertisement -
- Advertisement -

భద్రాద్రి కొత్తగూడెం: మావోయిస్టులు అమర్చిన బాంబు పేలి ఓ యువకుడు గాయపడ్డాడు. జిల్లాలోని లెనిన్ కాలనీకి చెందిన బ్రహ్మనాయుడు సోమవారం ఉదయం తన బైక్ పై వెళుతుండగా ఒక చెట్టు దగ్గర మావోయిస్టుల పోస్టర్లు కనబడడంతో ఏమిటా అని చూసేందుకు వెళ్లి తన బైక్ ఉండి పరిశీలిస్తుండగా.. ఒక్కసారిగా చెట్టు కింద మావోయిస్టులు అమర్చిన మందుపాతర పేలడంతో బైక్ తో సహా క్రింద పడిపోయాడు. కాలుకు గాయమై తీవ్ర రక్తస్రావం కావడంతో స్థానికులు అతడిని చర్లలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. అతని పరిస్థితి ప్రస్తుతానికి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. సాదారణంగా మావోయిస్టులు పోస్టర్లను చర్ల సమీప అటవీ ప్రాంతంలో అంటిస్తారు. కానీ, ఇలా ఊరికి సమీపంలో మందుపాతరలు అమర్చడంతో స్థానికులు తీవ్ర భయాందోళన చెందుతున్నారు.

Man Injured after bomb explosion in Kothagudem

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News