Friday, April 19, 2024

ఇంటి అద్దె అడిగినందుకు అంతం చేశాడు…

- Advertisement -
- Advertisement -

 

Man killed house owner for rent at tamilnadu

చెన్నై: ఇంటి కిరాయి పదే పదే అడుగుతుండడంతో యజమానిని కిరాయిదారుడు హత్య చేసిన సంఘటన తమిళనాడులోని చెన్నై ప్రాంతం కుంద్రతూర్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. ధన్‌రాజ్ అనే వ్యక్తి ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్నాడు. లాక్‌డౌన్ నేపథ్యంలో గత నాలుగు నెలల నుంచి అద్దెకు ఇవ్వకపోవడంతో యజమాని గుణశేఖర్ పలుమార్లు అడిగాడు. దీంతో ఇద్దరు మధ్య కొన్ని రోజుల నుంచి గొడవలు జరిగాయి. రెండు వాయిదాల్లో కిరాయి చెల్లిస్తానని ఒప్పందం చేసుకున్నాడు. కానీ చెల్లించకపోవడంతో యజమాని, కిరాయిదారుడి మధ్య గొడవ జరిగింది. గొడవ తారాస్థాయికి చేరుకోవడంతో ధన్‌రాజ్ కుమారుడు అజిత్ అతడిపై పగ పెంచుకొని కత్తితో యజమానిని పొడిచి చంపేశాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News