- Advertisement -
కుత్బుల్లాపూర్: బాచుపల్లి చౌరస్తాలో బుధవారం మధ్యాహ్నం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బైక్ పై వెళ్తున్న వ్యక్తిని వేగంగా వచ్చి అదుపుతప్పిన డిసిఎం వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో డాక్టర్ రెడ్డి ల్యాబ్ కు చెందిన ఉద్యోగి చంద్రకాంత్ రెడ్డి అక్కడిక్కకడే మృతి చెందాడు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న బాచుపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. అనంతరం కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Man killed in road accident at bachupally
- Advertisement -