Friday, April 26, 2024

మాదాపూర్‌లో రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి

- Advertisement -
- Advertisement -

father dies after son dies of covid in medchal

మనతెలంగాణ/హైదరాబాద్: రోడ్డు దాటుతున్న వ్యక్తిని కారు ఢీ కొట్టడంతో ఓ వ్యక్తి మృతిచెందిన సంఘటన నగరంలోని మాదాపూర్ హైటెక్ ఫ్లైఓవర్ వద్ద ఆదివారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం…జాగ్వార్ కారులో కెపిహెచ్‌బి నుంచి మాదాపూర్ వైపు వస్తున్న కారు రోడ్డు దాటుతున్న వ్యక్తిని ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్న మాదాపూర్ పోలీసులు కారును స్వాధీనం చేసుకున్నారు. కారు సౌరబ్ గుప్తా పేరుతో పై ఉంది. కారుపై ఓవర్ స్పీడ్ చలాన్లు రాజేంద్రనగర్, టోలీచౌకి, కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్ల పరిధిలో రూ.4,375 ఫైన్లు ఉన్నాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కారు యజమాని వివరాలు తెలిపేందుకు పోలీసులు వెనుకాడుతున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు మాదాపూర్ పోలీసులు తెలిపారు.

Man Killed in Road Accident at Madhapur

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News