Friday, March 29, 2024

గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి..

- Advertisement -
- Advertisement -

Man killed in Road Accident at Adibatla

రంగారెడ్డి: రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఆదిబట్ల పోలీస్టేషన్‌ పరిధిలోని కొంగరకలాన్‌ సర్వీసురోడ్డు సమీపంలో గుర్తు తెలియని వాహనం ఢీకొని గాయత్రి కన్‌స్ట్రక్షన్‌లో పనిచేస్తున్న ఆగయ్య(50) అనే వ్యక్తి మరణించాడు. వివరాల్లోకి వెళితే.. ఆదిబట్ల మున్సిపాలిటి పరిధిలోని బొంగుళూరు గ్రామానికి చెందిన ఆగయ్య(50) గాయత్రి కన్‌స్ట్రక్షన్‌లో ఉద్యోగం చేస్తున్నాడు. ఈ క్రమంలో శనివారం రాత్రి విధులు ముగించుకుని సర్వీసు రోడ్డులో ఇంటికి తిరిగి వస్తుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. దీంతో ఆగయ్య ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయాడు. సమాచానం అందుకున్న ఆదిబట్ల పోలీసులు మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Man killed in Road Accident at Adibatla

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News