లుధియానా: భార్య వివాహేతర సంబంధం పెట్టుకుందని ఆమెను భర్త బ్లేడ్తో కోసి చంపిన సంఘటన పంజాబ్ రాష్ట్రం లుధియానాలోని అశోక్ నగర్లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. అవతార్ సింగ్-జశ్వీర్ కౌర్ అనే దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. అవతార్ కార్పెంటర్గా పని చేస్తూ మద్యానికి బానిసయ్యాడు. దీంతో ఇంట్లో ఎప్పుడు గొడవలు ఉండేవి. గత సోమవారం రాత్రి పనికి వెళ్లొచ్చిన భర్త భార్యను భోజనం పెట్టమని అడిగాడు. అన్నం వండుతున్నానని కొంచెం సేపు వేచి ఉండాలని భార్య సూచించడంతో ఆమెను దూషించాడు. దీంతో ఇద్దరు మధ్య ఘర్షణ తారాస్థాయికి చేరుకోవడంతో బ్లేడ్ తీసుకొని భార్య ఛాతీ, పొట్ట, మెడపై భర్త కోశాడు. అనంతరం భర్త అక్కడి నుంచి పారిపోయాడు. ఇంట్లో ఇద్దరు కుమారులు కేకలు వేయడంతో స్థానికులు వచ్చి జశ్వీర్ కౌర్ను స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఆమె చికిత్స పొందుతూ మర్నాడు మృతి చెందారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. భార్య వివాహేతర సంబంధమే ఈ హత్యకు దారి తీసిందని పోలీసులు అనుమానిస్తున్నారు.
వివాహేతర సంబంధం… భార్యను బ్లేడ్తో కోసి… హత్య
- Advertisement -
- Advertisement -
- Advertisement -