Friday, April 26, 2024

ఒకే వేదికపై ఇద్దరిని ప్రేమపెళ్లి చేసుకున్న నవమన్మధుడు

- Advertisement -
- Advertisement -

రాయ్‌పూర్: ఓ యువకుడు ఇద్దరు అమ్మాయిలను ఒకే వేదికపై పెళ్లి చేసుకున్న సంఘటన ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బస్తర్ జిల్లా జగదల్పూర్ ప్రాంతంలో జరిగింది. చందు మౌర్య అనే యువకుడు ఇద్దరు అమ్మాయిలతో ప్రేమాయణం నడిపాడు. పెళ్లి విషయం వచ్చేసరికి ఎవరిని చేసుకోవాలో అర్థం కాలేదు. ఇద్దరు యువతుల కుటుంబ సభ్యులతో మాట్లాడి ఇద్దరిని పెళ్లి చేసుకుంటానని పెద్ద మనుషుల ముందు చెప్పాడు. వీరి పెళ్లికి గ్రామం పెద్దలు ఓకే చెప్పడంతో పెళ్లి జరిపించారు. పెళ్లి వీడియో, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. గిరిజనులను మీడియా ప్రతినిధులు రెండో పెళ్లి విషయం గురించి ప్రశ్నించారు. ఇందులో వింత ఏముందని గిరిజనులు అనడంతో మీడియా వాళ్లు నోరేళ్ల బెట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News