Thursday, April 25, 2024

గోదావరిలో వ్యక్తి గల్లంతు..

- Advertisement -
- Advertisement -

సత్తుపల్లి : మండల పరిధిలోని సత్యం పేటకు చెందిన సింహద్రి శ్రీనివాసరావు (40) ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తు జీవనం సాగిస్తున్నాడు. ఆదివారం సింహద్రి  మణుగూరు వద్ద గోదావరిలో స్నానం చేయడానికి దిగగా, ప్రమాదవశాత్తు కాలుజారి గల్లంతైనట్లు బంధువులు తెలిపారు.

మృతునికి భార్య, ఒక బాబు, కుమార్తె ఉన్నారు. స్థానికుల సమాచారం మేరకు ఘటన స్థలికి చేరుకున్న పోలీసులు గజ ఈతగాళ్ల సహయంతో మృతదేహం కోసం వెతకడం ప్రారంభించారు. మృతిని భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News