- Advertisement -
మెదక్: మెదక్ జిల్లా గడిపెద్దపూర్లో పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటనలో మంగళవారం ఉదయం మహిళ మృతి చెందింది. 80 శాతం కాలిన గాయాలతో చికిత్స పొందుతూ బాధితురాలు చక్రీబాయి మృత్యువాతపడ్డారు. బాకీ డబ్బులు ఇవ్వాలని అడిగినందుకు చక్రిబాయిపై పశువుల వ్యాపారి సాజిద్ పెట్రోల్ పోసి నిప్పంటించారు. దీంతో ఘటనా స్థలంలో ఆమె చనిపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పశువుల వ్యాపారి సాజిద్ ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నారు.
- Advertisement -