Thursday, April 25, 2024

లక్ష రూపాయల కోసం చెల్లిని చంపి…. అక్కపై హత్యాయత్నం

- Advertisement -
- Advertisement -

Man murder for one lakh in jagtial

 

జగిత్యాల: భూమి పట్టా చేయిస్తానని లక్ష రూపాయలు తీసుకొని మహిళను హత్య చేసి ఆమె అక్కను హత్యాయత్నం చేసిన సంఘటన జగిత్యాల జిల్లా రాయికల్ మండలం ఇటిక్యాల గ్రామంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. ఇటిక్యాల గ్రామంలో శివమ్మ(65), నర్సమ్మ(60)  అనే అక్కాచెల్లెలు నివసిస్తున్నారు. 25 గుంటల భూమి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి రాజారామ్ అనే వ్యక్తిని కలిశారు. రాజారామ్ కూడా ఇటిక్యాల గ్రామానికి చెందిన వాడే కావడంతో భూమి రిజిస్ట్రేషన్ కోసం లక్ష రూపాయలు అతడికి వృద్ధులు ఇచ్చారు. రిజిస్ట్రేషన్ చేయించకపోవడంతో లక్ష రూపాయలు ఇవ్వాలని రాజారామ్‌పై నర్సమ్మ, శివమ్మ ఒత్తిడి తెచ్చారు.

ఇద్దరు అక్కాచెల్లెల నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించినప్పటికి కుదరడంలేదు. ఫిబ్రవరి 26న వేముల వాడకు వెళ్దామని నర్సమ్మను తన బైక్‌పై రాజారామ్ తీసుకెళ్లాడు. వేముల వాడకు వెళ్లిన నర్సమ్మ తిరిగిరాలేదు. భూమి రిజిస్ట్రేషన్ చేయిస్తానని ఫిబ్రవరి 28న శివమ్మను రాయికల్ తీసుకెళ్లాడు. తహసీల్దార్ మేడిపల్లిలో ఉన్నాడని అక్కడికి తీసుకెళ్లాడు. మార్గం మధ్యలో ఎస్‌ఆర్‌ఎస్ కాలువలో ముఖం కడుక్కోవాలని ఆమెకు సలహా ఇచ్చాడు. కాలువలోకి దిగుతుండగా వెనక నుంచి శివమ్మను రాజారామ్ తోసేశాడు. శివమ్మ కొంచెం దూరం నీళ్లలో కొట్టుకెళ్లిన తరువాత చెట్టును పట్టుకొని బయటకు వచ్చింది. స్థానిక పోలీస్ స్టేషన్‌లో తనపై హత్యాయత్నం జరిగిందని, తన చెల్లె నర్సమ్మను రాజారామ్ చంపి ఉంటాడని ఫిర్యాదు చేసింది. సిఐ కృష్ణ కుమార్, ఎస్‌ఐ ఆరోగ్యమ్ కేసు నమోదు చేసి రాజారామ్ అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా తానే హత్య చేశానని ఒప్పుకున్నాడు. లక్ష రూపాయల కోసం వారిని చంపేశానని విచారణలో తెలిపాడు. అతడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News