Friday, March 29, 2024

తనకు దక్కాల్సిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడని…. అంతమొందించాడు….

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తాను పెళ్లి చేసుకోబోయే అమ్మాయిని మరో వ్యక్తి చేసుకున్నాడని అతడిని చంపేసిన సంఘటన మేడ్చల్ జిల్లా మల్కాజిగిరిలో జరిగింది. నిందితుడు శ్రీనివాస్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… రైల్వేలో ఉద్యోగం చేసే విజయ్ కుమార్ 2013లో భవ్యను పెళ్లి చేసుకున్నాడు. విజయ్ కుమార్ తల్లికి కరోనా వైరస్ సోకడంతో భార్య పుట్టినిల్లు వైజగ్ కు పంపించాడు. గుడ్డ శ్రీనివాస్ రెడ్డి  భవ్యకు బంధువు కావడంతో గతంలో ఆమె పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నాడు. శ్రీనివాస్ ఆర్మీలో పని చేస్తున్నాడు. విజయ్ కుమార్ ను చంపితే భవ్య తనకు దక్కుతుందని భావించాడు. మూడు రోజుల పాటు శ్రీనివాస్ ఇంటి దగ్గర రెక్కీ నిర్వహించారు. విజయ్ కుమార్ ఇంట్లో వీడియో కాల్ మాట్లాడుతుండగా వేటకోడవళ్లతో దాడి చేయడంతో అక్కడికక్కడే చనిపోయాడు. స్థానికుల సమాచారం మేరకు ఎసిపి శ్యామ్ సుందర్ రావు, సిఐ జగదీశ్వర్ రావు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. సిసి కెమెరాల ఆదారంగా నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్ తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News