Friday, April 19, 2024

కాళ్లు, చేతులు కట్టేసి నడిరోడ్డుపై గొంతుకోసి…

- Advertisement -
- Advertisement -

 

హైదరాబాద్: వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని ఓ యువకుడిని చేతులు, కాళ్లు కట్టేసి నడిరోడ్డుపై గొంతు కోసి హత్య చేసిన సంఘటన హైదరాబాద్ లోని కంచన్ బాగ్ పోలీస్ స్టేషన్ ఫరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం….  ముషీరాబాద్‌కు చెందిన సయ్యద్ మునవర్ ఖాద్రి(27) అనే యువకుడు చాంద్రాయణగుట్టలోని ఓ యువతిని ఐదేళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఈ దంపతులకు రెండేళ్ల పాపతో పాటు బాబు ఉన్నాడు. యువతి సోదరితో ఖాద్రి వివాహేతర సంబంధం పెట్టుకోవడంతో ఆమె తల్లిదండ్రులు పలుమార్లు హెచ్చరించారు. రెండు నెలల క్రితం ఇద్దరు ఇంటి నుంచి పారిపోయి తిరిగి వస్తే బంధువులు హెచ్చరించి పంపించారు. అప్పటి నుంచి కూడా వారి మధ్య వివాహేతర సంబంధం కొనసాగుతూనే ఉంది. ఆదివారం చాంద్రాయణగుట్టకు ఖాద్రి పిలిపించి మాట్లాడుతుండగా యువతి బంధువులతో అతడు ఘర్షణకు దిగడంతో చేతులు, కాళ్లు కట్టేసి నడి రోడ్డుపై గొంతు కోసి హత్య చేశారు. స్థానికుల సమాచారం మేరకు సంతోష్ నగర్ ఎసిపి శివరామకృష్ణ, కంచన్‌బాగ్ ఇన్‌స్పెక్టర్ జె వెంకట్ రెడ్డి ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతుడి సొదరి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News