Thursday, April 25, 2024

పొలం నుంచి ఇంటికి వెళ్తుండగా కత్తులతో నరికి…

- Advertisement -
- Advertisement -

 

అమరావతి: పొల నుంచి ఇంటికి వెళ్తున్న ఓ రైతును దారుణంగా చంపేసిన సంఘటన కర్నూలు జిల్లా పత్తికొండ మండలం కోతిరాళ్లలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… గుమ్మిరాళ మల్లిఖార్జున (48) తన భార్యతో కలిసి పొలం పనులకు వెళ్లాడు. పత్తి కొండలో పని ఉండడంతో వెళ్లి వస్తానని భార్యతో చెప్పి ఇంటికి బయలుదేరాడు. మార్గం మధ్యలో గుర్తు తెలియని వ్యక్తులు కత్తులు, మారణాయుధాలతో అతడిపై దాడి చేశారు. గొర్రెల కాపారులు మృతదేహాన్ని గుర్తించి అతడి భార్యకు సమాచారం ఇచ్చారు. గ్రామస్థుల సమాచారం మేరకు సిఐ ఆదినారాయణ రెడ్డి తన సిబ్బందితో కలిసి గ్రామానికి చేరుకున్నారు. గ్రామంలో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేశాడు. వివాహేతర సంబంధం అతడి ప్రాణాలు తీసి ఉంటుందని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మృతిడి కాల్‌డేటాను పరిశీలిస్తున్నామని పేర్కొన్నారు. మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం పత్తికొండకు తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News