Friday, April 26, 2024

స్నానానికని వెళ్తే… వ్యక్తిని హత్య చేసిన రైతులు

- Advertisement -
- Advertisement -

 

కర్నూలు: ఉల్లిగడ్డలు దొంగతనానికి వచ్చాడనే అనుమానంతో ఓ వ్యక్తిని రైతులు కొట్టి చంపిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూలు జిల్లా కోసిగి ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ఆదోని మండలం కపటి నాగాలపురం గ్రామానికి చెందిన నరసన్న అనే వ్యక్తి కోసిగి మండల కేంద్రంలో జరిగిన సిద్ధరూడ స్వామి జాతర వెళ్లాడు. జాతరలో రాత్రి అయ్యేసరికి పడుకొని తెల్లారి వెళ్దామనుకున్నాడు. అదివారం తెల్లవారుజామున లేచి రోడ్డుపై వెళ్తుండగా కాలువ కొంచెం దూరంలో కనిపించడంతో అడ్డదారిలో పొలాల గుండా కాలువ వైపు వెళ్తున్నాడు. తెల్లవారుజామున కాబట్టి అక్కడ ఉన్న ఉల్లిగడ్డల దొంగతనం కోసం వచ్చాడని నరసన్నను రైతులు కట్టేలతో చితకబాదారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని తీవ్రంగా గాయపడిన అతడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. అతడు చికిత్స పొందుతూ చనిపోయాడు. పోలీసులు ముగ్గురు రైతులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News